
ముంబై: రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) తొలి సీజన్లో హైదరాబాద్ హీరోస్ హ్యాట్రిక్ సాధించింది. శుక్రవారం (జూన్ 20) జరిగిన మ్యాచ్లో హీరోస్ 43-–12 తేడాతో కళింగ బ్లాక్ టైగర్స్ను ఓడించింది. వరుసగా మూడో విక్టరీతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో హైదరాబాద్ హీరోస్ ఏడు ట్రైలను సాధించింది. జోజి నాసోవా రెండు ట్రైలతో ఆకట్టుకోగా..టెరియో తమాని నాలుగు ట్రైలను కన్వర్ట్ చేసి జట్టుకు అదనంగా 8 పాయింట్లను అందించాడు. తమాని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. హైదరాబాద్ హీరోస్ తమ తర్వాతి మ్యాచ్లో ముంబై డ్రీమర్స్తో తలపడనుంది.