హైటెక్స్​లో కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ ఎక్స్ పో షురూ

హైటెక్స్​లో కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ ఎక్స్ పో షురూ
  •    ప్రారంభించిన టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మాదాపూర్, వెలుగు :  హైటెక్స్​లో శుక్రవారం హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ ఎక్స్ పోను రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ టూరిజం బ్రాండ్​ అంబాసిడర్​గా ఉంటూ ప్రోత్సహించాలన్నారు.  

తెలంగాణలో గొప్ప సాంస్కృతిక వారసత్వ చరిత్ర కలిగి ఉందన్నారు. ఈజ్​ఆఫ్​డూయింగ్​ బిజినెస్​లో రాష్ట్రం అత్యుత్తమంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ ఎక్స్​పోలను సందర్శించి, వాటి ఆవశ్యకతలను చెప్పాలన్నారు. ఈ రెండు ఎక్స్​పోలలో 150 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని హైటెక్స్​ బిజినెస్​ హెడ్​ శ్రీకాంత్​ తెలిపారు.