
- కిలోమీటర్ల మేర నిలుస్తున్న వాహనాలు
- హోటళ్లు, దాబాల ముందు ఇష్టానుసారంగా పార్కింగ్
- ఓఆర్ఆర్పై సాఫీగా సాగుతున్న జర్నీ.. దిగగానే నరకం
హైదరాబాద్, వెలుగు: ఔటర్రింగ్రోడ్డు ఎగ్జిట్పాయింట్లు ట్రాఫిక్వలయాలుగా మారుతున్నాయి. ఓఆర్ఆర్పై నిర్ణీత స్పీడులో జర్నీ సాఫీగా సాగుతుండగా, దిగిన వెంటనే వాహనదారులకు నరకం కనిపిస్తోంది. సర్వీస్రోడ్లతోపాటు ఓఆర్ఆర్కు కనెక్టివిటీగా ఉన్న నేషనల్ హైవేలపై ట్రాఫిక్సమస్య ఎక్కువగా ఉంటోంది. ఎగ్జిట్లను ఆనుకుని నడుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు ముందు ఇష్టాను సారంగా వెహికల్స్ను పార్క్చేయడం తలనొప్పిగా మారింది.
రోడ్ల మీద నిలుపుతుండడంతో ఒకేసారి రెండు భారీ వెహికల్స్వెళ్లలేని పరిస్థతి ఉంటోంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ల వద్ద ట్రాఫిక్దారుణంగా ఉంటోంది. ఒక్కోసారి టోల్ప్లాజా వరకు వెహికల్స్ఆగుతున్నాయి. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. పఠాన్ చెరువు, శంషాబాద్, పెద్దఅంబర్ పేట తదితర ఎగ్జిట్ల వద్ద రోజూ ట్రాఫిక్సమస్య తలెత్తుతోంది.
ఎగ్జిట్ల వద్ద ట్రాఫిక్కారణంగా రాజేంద్రనగర్, అత్తాపూర్, ఓల్డ్ సిటీ, నార్సింగి, కోకాపేట ప్రాంతాల నుంచి ముంబై హైవే వైపు వెళ్లే వాహనదారులు మోకిల మీదుగా శంకర్ పల్లి, బీడీఎల్ నుంచి కంది వద్ద ముంబై హైవే ఎక్కుతున్నారు. పఠాన్ చెరులోని ముత్తంగి ఎగ్జిట్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరితే ఇబ్బందులు తప్పుతాయి. శంషాబాద్, పెద్దఅంబర్ పేట వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముత్తంగి ఎగ్జిట్వద్ద ఎలాంటి పనులు జరగపోయినా ట్రాఫిక్సమస్య తీరడం లేదు.
గత మూడు, నాలుగు నెలల నుంచి సమస్య తీవ్రమవుతోంది. ట్రాఫిక్పోలీసులు హోటళ్లు, రెస్టారెంట్ల ముందు ఇష్టానుసారం వాహనాలు నిలపకుండా చూస్తే ట్రాఫిక్తగ్గే అవకాశం ఉంది.