దొంగల ముఠాను పట్టించిన చిన్న క్లూ

దొంగల ముఠాను పట్టించిన చిన్న క్లూ

రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ఘరానా ముఠాను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నాల శివ శంకర్ అనే పాత నేరస్తుడు వృత్తిరీత్యా ఆటో మెకానిక్. ఇతను 2005 సంవత్సరం నుండి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. గతంలో కూడా అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. శివ శంకర్ మరో ముగ్గురు సభ్యులతో ముఠాగా ఏర్పడి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడతున్నారు. ఈ ముఠా నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా దొంగతనాలు చేశారు. ఒక చిన్న క్లూ ఆధారంగా ఈ ముఠాను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి.. వారి నుంచి 28.5 తులాల బంగారు నగలు, 3.2 కేజీల వెండి, 30 రోల్డ్ గోల్డ్ చైన్లు, ఒక ఆటో ట్రాలీ, ఒక మోటార్ సైకిల్ మరియు రెండు టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 21 లక్షల 20 వేల ఒక వంద రూపాయలు (21,20,100) గా తెలిపారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కమిషరరేట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను రిమాండ్ కు తరలించారు.

For More News..

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇలా చేయండి

హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్

బాయ్ ఫ్రెండ్ తో గొడవ.. 30 వేల అడుగుల ఎత్తులో ఫ్లైట్ అద్దం పగులగొట్టిన యువతి

ఆడుకుంటూ కారులో ఇరుక్కొని ఇద్దరు పిల్లలు మృతి