
హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్డుపై మొబైల్ వాడుతూ వాహనం నడిపితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని, రిపీట్ అయితే క్రిమినల్ కేసులు పెడుతామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ టైం డ్రైవింగ్లో మొబైల్ వాడుతూ పట్టుబడితే రూ.వెయ్యి జరిమానా, రెండోసారి జరిగితే నెగ్లిజెంట్, డేంజరస్ డ్రైవింగ్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్లో 54 వేలు నమోదైనట్లు తెలిపారు. ఫోన్ కాల్స్ వస్తే వాహనం ఆపి మాట్లాడాలని సూచించారు.