ఎలైట్ మ్యాచ్‭లో భారీగా స్కోర్ చేసిన హైదరాబాద్

ఎలైట్ మ్యాచ్‭లో భారీగా స్కోర్ చేసిన హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌: తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ మంచి స్కోరు చేసింది. మికిల్‌‌‌‌ జైస్వాల్‌‌‌‌ (137 నాటౌట్‌‌‌‌), తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (135) సెంచరీలతో దుమ్మురేపడంతో.. హైదరాబాద్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 115 ఓవర్లలో 395 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 256/5 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో  రెండో రోజు ఆట కొనసాగించిన తన్మయ్‌‌‌‌, జైస్వాల్‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌కు 124 రన్స్‌‌‌‌ జోడించారు.

ఈ దశలో తన్మయ్‌‌‌‌ ఔటైనా.. ఓ ఎండ్‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌ ఒంటరిగా పోరాడాడు. కానీ తమిళనాడు బౌలర్లు చెలరేగడంతో లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో ప్రతీక్‌‌‌‌ రెడ్డి (0), అనికేత్‌‌‌‌ రెడ్డి (0), కార్తికేయ (6), పున్నయ్య (0) చేతులెత్తేశారు. 84 రన్స్‌‌‌‌కే ఈ నలుగురు ఔటయ్యారు. సందీప్‌‌‌‌ వారియర్‌‌‌‌ 5, విఘ్నేశ్‌‌‌‌ 4 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 35 ఓవర్లలో  వికెట్​ నష్టపోకుండా 203 రన్స్‌‌‌‌ చేసింది. నారాయణ్‌‌‌‌ జగదీషన్‌‌‌‌ (116 బ్యాటింగ్‌‌‌‌), సాయి సుదర్శన్‌‌‌‌ (87 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. తమిళనాడు ఇంకా 192 రన్స్‌‌‌‌ వెనుకబడి ఉంది.