
హైదరాబాద్: తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది. మికిల్ జైస్వాల్ (137 నాటౌట్), తన్మయ్ అగర్వాల్ (135) సెంచరీలతో దుమ్మురేపడంతో.. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 115 ఓవర్లలో 395 రన్స్కు ఆలౌటైంది. 256/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన తన్మయ్, జైస్వాల్ ఆరో వికెట్కు 124 రన్స్ జోడించారు.
ఈ దశలో తన్మయ్ ఔటైనా.. ఓ ఎండ్లో జైస్వాల్ ఒంటరిగా పోరాడాడు. కానీ తమిళనాడు బౌలర్లు చెలరేగడంతో లోయర్ ఆర్డర్లో ప్రతీక్ రెడ్డి (0), అనికేత్ రెడ్డి (0), కార్తికేయ (6), పున్నయ్య (0) చేతులెత్తేశారు. 84 రన్స్కే ఈ నలుగురు ఔటయ్యారు. సందీప్ వారియర్ 5, విఘ్నేశ్ 4 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 203 రన్స్ చేసింది. నారాయణ్ జగదీషన్ (116 బ్యాటింగ్), సాయి సుదర్శన్ (87 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తమిళనాడు ఇంకా 192 రన్స్ వెనుకబడి ఉంది.