
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లో గత కొంత కాలంగా డ్రగ్స్ దందా చేస్తున్న వారిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన వరుణ్ ప్రభు, చైతన్య అన్నదమ్ములు. లండన్లో చదువుకున్నారు. విదేశాల్లో నైజీరియన్తో ఏర్పడ్డ పరిచయాలతో హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి దందాలోకి దిగారు. ఇటీవల హైదరాబాద్ వచ్చి తరచూ బెంగళూరు వెళుతూ అక్కడి నుంచి నైజీరియా వ్యక్తుల పరిచయాలతో డ్రగ్స్ను హైదరాబాద్ కు తెచ్చేవారు. కిరణ్ అనే వ్యక్తితో పాటు మరికొంతమందికి అమ్ముతూ ఉండేవారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని వివేకానంద కాలనీలో బుధవారం ఎండీఎంఏ డ్రగ్స్, ఓజీ కుష్ ను ఓ వ్యక్తికి అమ్ముతుండగా.. ఎస్టీఎఫ్ సిబ్బందికి సమాచారం అందింది.
వారిని పట్టుకునేందుకు ఎస్టీఎఫ్ ఎస్ఐబాలరాజు సంధ్య, సిబ్బందితో వెళ్లారు. వారిని గమనించిన వరుణ్ప్రభు, చైతన్య తప్పించుకునేందుకు యత్నించారు. అలాగే, ఎస్ఐపై, కానిస్టేబుల్పై దాడి చేయగా, ఎస్టీఎఫ్ టీమ్ ఆ ముగ్గురిని పట్టుకున్నారు. అలాగే, వారితో సంబంధం ఉన్న వంశీ, సాయికృష్ణ, నందు సాయిపై కేసు నమోదు చేశారు. వారంతా పరారీలో ఉన్నట్టు ఎస్టీఎఫ్ ఎస్ఐ సంధ్య తెలిపారు. నిందితుల నుంచి 2.58 ఎండీఎంఏ డ్రగ్స్, 38.56 గ్రాముల ఓజీ కుష్ ను, ఒక బైకు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.