హైదరాబాద్, వెలుగు: ఫిడే రేటింగ్తో కూడిన ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ తొలిసారి హైదరాబాద్లో జరగనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్తో కలిసి ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్టు స్లాన్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఈ టోర్నీకి సంబంధించిన బ్రోచర్ను శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆవిష్కరించారు. వివిధ దేశాల నుంచి 500 పైచిలుకు ప్లేయర్లు ఈ టోర్నీకి హాజరయ్యే అవకాశం ఉందని స్లాన్ స్పోర్ట్స్ ఫౌండర్ ఎస్పీవీఎం సుబ్రమణ్యం తెలిపారు. ఓవరాల్గా రూ.10 లక్షల ప్రైజ్మనీ ఉన్న ఈ టోర్నీలో విన్నర్కు రూ. లక్ష నగదు లభిస్తుందని స్లాన్ స్పోర్ట్స్ సీఓఓ నవీన్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల కోసం 9885979740 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
