
- రూ.100 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
జూబ్లీహిల్స్, వెలుగు: రెండు దశాబ్దాలకు పైగా జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు సమీపంలో కబ్జాకు గురైన జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన 2 వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సి ఉండగా, సత్యనారాయణ అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా అందులో నర్సరీ నిర్వహిస్తున్నాడు. గతంలో జీహెచ్ఎంసీ పలుమార్లు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా, ఫేక్ ఇంటి నంబర్తో కోర్టును తప్పుదోవ పట్టించి స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్నాడు.
షెడ్లు, నర్సరీ నిర్వహిస్తుండడంతో హౌసింగ్ సొసైటీ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో సత్యనారాయణకు హైడ్రా నోటీసులు ఇచ్చారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన స్టేటస్కోను రద్దు చేస్తూ, హైడ్రా తీసుకోబోయే చర్యలకు అనుమతి ఇవ్వడంతో సోమవారం హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపి ఆ స్థలాన్ని కబ్జా నుంచి విముక్తి చేశారు.