కాంగ్రెస్లో నేను ఉండొద్దా.. విష ప్రచారం వెనక ఎవరున్నారు? : జగ్గారెడ్డి

కాంగ్రెస్లో నేను ఉండొద్దా.. విష ప్రచారం వెనక ఎవరున్నారు? : జగ్గారెడ్డి

సోషల్ మీడియాలో గత కొంత కాలంగా తనపై జరుగుతున్న విష ప్రచారంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 
కాంగ్రెస్లో నేను ఉండొద్దా..విషప్రచారం వెనక ఎవరున్నారు? ..సోషల్ మీడియాలో నాపై విషప్రచారం సాగుతోంది...ఏడాదిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని ఇలా చేస్తున్నారా.. వాళ్ల ఆనందమేమిటో నాకర్థం కావడంలేదని జగ్గారెడ్డి అన్నారు. 
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో చేశారు.. పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు ఎన్నో కార్యక్రమాలు చేశానని కాంగ్రెస్ పట్ల తనకున్న విధేయతను ఇంకెలా నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. 
నా సెగ్మెంట్ లో 22 కి.మీ.లు రాహుల్ గాంధీ జోడో యాత్ర జరిగింది.. నా ఏర్పాట్లు చూసి రాహుల్ కూడా ఫిదా అయ్యిండని పేర్కొన్నారు. నా పేరు రాహుల్ కు నోటెడ్ అయిపోయింది. జోడో యాత్ర ఏర్పాట్లు చూసి నన్ను రాహుల్ ఎంతో మెచ్చుకున్నారు. నా విషయంలో ఇంత శాడిస్టుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి అన్నారు. 
2018లో కోట్లు ఖర్చు చేసి రాహుల్ సభ ఏర్పాటు చేశాను.. కేసులు పెడితే కొట్లాడి గెలిచాను.. పార్టీ తరపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నా భార్యను నిలబెట్టిన.. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఏకగ్రీవ కాకుండా అడ్డుకున్నానని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పట్ల నా కున్న విధేయతను ఇంకెలా నిరూపించుకోవాలి.. ఏడాదిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం బాధిస్తుందని  జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో నేను ఉండొద్దా.. దీని వెనక వ్యూహం ఉందా.. నేను పార్టీ మారుతున్నానని చెప్పటానికి  మీకు ప్యాకేజీలు ఎవరు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. పద్దతి మానుకోవాలని హెచ్చరించారు.