ప్రకాష్ రాజ్ కు సారీ చెప్పిన బీజేపీ ఎంపీ

ప్రకాష్ రాజ్ కు సారీ చెప్పిన బీజేపీ ఎంపీ

కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా యాక్టర్ ప్రకాష్ రాజ్ కు సారీ చెప్పారు. ప్రధాని మోడీని విమర్శించినందుకు ప్రకాష్ రాజ్ పై ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రకాష్ రాజ్ ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు  ప్రతాప్ సింహా ప్రకాష్ రాజ్ కు క్షమాపణలు చెప్పారు. 2017 అక్టోబర్ 2,3 తేదీల్లో తాను చేసిన వ్యాఖ్యలను మిమ్మల్ని బాధపెట్టాయని … ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ట్విట్టర్లో కోరారు. ట్విట్టర్లో, పేస్ బుక్ లో కూడా తన పోస్టును  వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రతాప్.