త్వరలోనే తాను ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా తగిన వ్యక్తిని సీఈవోగా నియమించి.. ఆ స్థానం నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈవిషయాన్ని ట్విట్టర్ వేదికగా మస్క్ వెల్లడించారు. సీఈవో పదవికి రిజైన్ చేసిన తర్వాత తాను ట్విట్టర్ సాఫ్ట్ వేర్, సర్వర్స్ టీమ్ లపై పనిచేస్తానని పేర్కొన్నారు.
ట్విట్టర్ సీఈవో పదవిలో తాను కొనసాగాలా ? వద్దా ? అనే దానిపై కొన్ని రోజుల క్రితమే ఎలాన్ మస్క్ ట్విట్టర్ పోల్ ను నిర్వహించారు. ఈ పోల్ లో వచ్చే తీర్పుకు, ఫలితాలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే ఆ పోల్ లో దాదాపు 57.5 శాతం మంది ట్విట్టర్ సీఈవో పదవి నుంచి మస్క్ వైదొలగాలనే దానికే ‘యస్’ చెప్పారు. మరో 42.5 శాతం మంది ఇందుకు ‘నో’ చెప్పారు. ఈ పోల్ తీర్పు ప్రకారమే ఆయన సీఈవో పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ కొత్త సీఈవో గా నియమించేందుకు అర్హుడైన వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది.