తన నకిలీ ఫేస్‌బుక్ పేజీపై స్పందించిన ఐఏఎస్

తన నకిలీ ఫేస్‌బుక్ పేజీపై స్పందించిన ఐఏఎస్

పౌరసత్వ చట్టంపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. 2015 సివిల్ సర్వీసెస్ టాపర్, ఐఏఎస్ ఠీనా దాబీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ పేజీని ఏర్పాటుచేశారు కొంతమంది దుండగులు. ఆ పేజీలో పౌరసత్వ చట్టాన్ని మరియు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హిందీలో ఉన్న ఆ మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఐఏఎస్ ఠీనా దాబీ పేరుతో పేజీ ఉండడంతో ఓ మీడియా ప్రతినిధి ఆమెను కలిసి వివరణ అడిగారు. ఆ పేజీపై స్పందించిన ఠీనా దాబీ.. ఆ పేజీ తన ఒరిజినల్ పేజీ కాదని, దానికి తనకు ఎటువంటి సంబంధంలేదని ఆమె అన్నారు. నకిలీ పేజీ సృష్టించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.

2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వలస వచ్చిన శరణార్థులకు ఈ చట్టం భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది.

For More News..

అదే తరహాలో 9 హత్యలు చేసిన దిశ నిందితులు?
సీఎం కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు !!