ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొద్ది రోజులుగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులైన ఇంతియాజ్ ను సెర్ప్ సీఈఓగా బదిలీ చేసింది. అంతేకాదు సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇంతియాజ్ కృష్ణా జిల్లా కలెక్టర్ గా కీలకబాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలతో ఈయన తప్పనిసరి పరిస్తితుల్లోనే మైనారిటీ సంక్షేమ శాఖకు బదిలీ అయ్యారు. అయితే తాజాగా అక్కడి నుండి సెర్ప్  కు బదిలీ చేయడం.. సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
అలాగే మొన్నటి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా వ్యవహరించి రాష్ట్ర సర్వీసులకు బదిలీ అయిన గంధం చంద్రుడును మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించింది. అలాగే కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా స్వప్నిల్ దినకర్, చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా రాజబాబు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గా సుమిత్ కుమార్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.