మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి 

మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి 
  • మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి 

ఇబ్రహీంపట్నం, వెలుగు : బీఆర్ఎస్​ మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తిలో చారిత్రాత్మక నందీశ్వరాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఇబ్రహీంపట్నంలో బీఆర్​ఎస్  ఆఫీసును ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్​ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు క్యామ మల్లేశ్​, ప్రశాంత్​కుమార్​రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు అందని బీ ఫామ్ 

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్​51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్ లు ​ అందించారు. కానీ ఇందులో  రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్​అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డికి మాత్రం ఇవ్వలేదు. సోమవారం అందించే బీ ఫామ్​లలో ఎమ్మెల్యేది ఉంటుందని సమాచారం. గతంలో సిట్టింగ్ ల జాబితాలోనే మంచిరెడ్డి పేరును సీఎం ప్రకటించారు.