భారత క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజులో ICC కోత    

భారత క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజులో ICC కోత    

న్యూజిలాండ్‌ పర్యటనలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్(ICC) భారీ షాక్ ఇచ్చింది. భారత క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో T-20 లో నిర్ణీత సమయంలో ఓవర్లు ముగించని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా… 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. దీంతో ICC మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున 2 ఓవర్లకు మొత్తం 40 శాతం జరిమానా విధించారు. ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ బ్రౌన్‌, షాన్‌ హైగ్‌, మూడో అంపైర్‌ మెహోత్రా కోహ్లీ సేనపై ఆరోపణలు నమోదు చేశారు. అయితే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పొరపాటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ జరగలేదు.