
2022 బెస్ట్ ఐపీఎల్ టీమ్ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు క్రికెటర్లకు చోటు దక్కింది. కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు 2022 ఐసీసీ టీ20 టీమ్లో సభ్యులుగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్లో జట్టును విజేతగా నిలిపిన జోస్ బట్లర్ను ఈ టీం కెప్టెన్గా ఐసీసీ నియమించింది. ఐసీసీ టీ 20లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక నుంచి ఒక్కో క్రికెటర్ ఎంపికయ్యాడు.
ఐసీసీ 2022 టీ20 టీమ్ : బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), కోహ్లీ (భారత్), సూర్యకుమార్ యాదవ్ (భారత్), హార్దిక్ పాండ్య (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), సికిందర్ రజా (జింబాబ్వే), సామ్ కరన్ (ఇంగ్లాండ్), హసరంగ (శ్రీలంక), హ్యారిస్ రౌఫ్ (పాకిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్).