దంచికొట్టిన షెఫాలీ వర్మ.. బంగ్లాకు భారీ టార్గెట్

దంచికొట్టిన షెఫాలీ వర్మ.. బంగ్లాకు భారీ టార్గెట్

పెర్త్: ICC ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది.

క్రీజులో ఉన్నంత సేపు బాల్ పై విరుచుకుపడిన షెఫాలీ వర్మ.. 17 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో (39) రన్స్ చేసింది. 5.3 ఓవర్ లో వర్మ ఔట్ కావడంతో రన్ రేట్ కాస్త తగ్గింది. ఆ తర్వాత  జెమీమా రోడ్రిగ్స్‌(34), వేదా కృష్ణమూర్తి(20) విరుచుకు పడటంతో బంగ్లాకు ఛాలెంజింగ్ టార్గెట్ విసిరింది భారత్.

బంగ్లా బౌలర్లలో

పన్నా, సాల్మా చెరో 2 వికెట్లు తీశారు.