ఐసీయూ ఆన్​ వీల్స్

ఐసీయూ ఆన్​ వీల్స్

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కర్నాటక ఆర్టీసీకి చెందిన బస్సులనే ఐసీయూ యూనిట్లుగా మార్చి అవసరమైన వారికి సేవలు అందిస్తోంది. హాస్పిటల్స్​లో ఉండే ఎక్విప్​మెంట్​తోనే ఒక్కో బస్సుల్లో నాలుగు ఐసీయూ బెడ్స్​ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మెడికల్​ స్టాఫ్​ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ బస్సులను ఎక్కువగా బెంగళూరు సిటీతో పాటు రిమోట్​ ఏరియాలో వాడుతున్నారు. ఐసీయూ ఆన్​ వీల్స్​కు అదనంగా ఆక్సిజన్​ ఆన్​ వీల్స్ ​స్కీమును కూడా కర్నాటక ఆర్టీసీ ప్రారంభించింది. ప్రతి బస్సులో ఆక్సిజన్​ ఎక్విప్​మెంట్​తో పాటు వెంటిలేటర్, ఎమర్జెన్సీ మెడిసిన్​ సిస్టంతో పాటు అన్నింటిని ఏర్పాటు చేశారు. పవర్​కు ఇబ్బంది లేకుండా జనరేటర్​ సిస్టంను వాడుతున్నారు. ఒక్కో బస్సు కోసం దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పటికే 12 ఆక్సిజన్​ సప్లై బస్సులు ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.