18వేల కోట్లిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటం: కేటీఆర్

18వేల కోట్లిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటం: కేటీఆర్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆ సక్తికర ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రధాని మోడీ 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తేమునుగోడు నుంచి పోటీ నుండి తప్పుకుంటామని.. బీజేపీ సిద్ధమా..? అంటూ ట్వీట్టర్ ద్వారా సవాల్ విసిరారు.

ఫ్లోరోసిస్ నిర్మూలనకు 19వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేస్తే పట్టించుకోని కేంద్రం..రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి 18వేల కాంట్రాక్టు ఇచ్చారని మంత్రి  కేటీఆర్  ఆరోపించారు. 

‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడైతే దేశ సంపద పెరగదు..మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే నల్గొండ జిల్లా బాగుపడదు.. రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు.. గుజరాత్ కు గత ఐదు నెలల్లో 80వేల కోట్ల ప్యాకేజీలు.. మా తెలంగాణకు కనీసం 18వేల కోట్లు ఇవ్వలేరా..? అంటూ ప్రశ్నించారు.