- కార్యకర్తలను అగ్రనేతలు కలిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారం కోల్పోయిన తర్వాత సమీక్షలు చేయడం.. క్యాడర్ను అగ్రనేతలు కలవడం మంచిదే.. కానీ ఈ పని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేయాల్సిందని మెజార్టీ బీఆర్ఎస్కార్యకర్తలు, క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ముందు ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి లాభమో అడిగాల్సిందని.. అలా చేసి ఉంటే మూడోసారి బీఆర్ఎస్గెలిచి.. కేసీఆర్హ్యాట్రిక్సీఎం అయి ఉండేవారని చెప్తున్నారు. నాలుగు రోజులుగా తెలంగాణ భవన్వేదికగా నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల సన్నద్ధత సమావేశాల్లో.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కార్యకర్తలు తమ మనసులోని అభిప్రాయాలను ఓపెన్గానే చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పడానికి మొహమాట పడుతున్నవారు రాతపూర్వకంగా తమ ఒపీనియన్ను వ్యక్తం చేస్తున్నారు. రాతపూర్వకంగా అభిప్రాయాలు చెప్పిన కార్యకర్తల్లో కొందరికి మూడు రోజులుగా పార్టీ చీఫ్కేసీఆర్ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. పార్టీకి పూర్వవైభవం తేవడానికి ఏం చేయాలని కేసీఆర్అడిగితే తమ అభిప్రాయాన్ని పార్టీ నేతలు ఓపెన్గానే చెప్తున్నారు. తెలంగాణ భవన్లోనూ కార్యకర్తలు పార్టీ ముఖ్య నేతలకు ఇస్తున్న ఫీడ్బ్యాక్దాదాపు ఒకేలా ఉంటున్నది.
పార్టీ కోసం కష్టపడినవారినీ పట్టించుకోలేదు
తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న నాయకత్వం పట్టించుకున్న పాపాన పోలేదని.. తామే హైదరాబాద్వరకు వచ్చి కలిసేందుకు ప్రయత్నించినా ముఖ్య నేతలు కనీసం అపాయింట్మెంట్ఇవ్వలేదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రగతి భవన్లో ఉండటంతో అక్కడికి వెళ్లే అవకాశం దొరకలేదన్నారు. ఇన్ని రోజులకైనా కార్యకర్తలు గుర్తుకు రావడం మంచిదని, ఇలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచిస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న హరీశ్రావు సహా మిగతా ముఖ్య నేతలు మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కేసీఆర్ సహా తామంతా క్యాడర్కు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.