పాతబండిని తుక్కుగా మారిస్తే... అదనపు డిస్కౌంట్..

పాతబండిని తుక్కుగా మారిస్తే... అదనపు డిస్కౌంట్..
  • కంపెనీలకు మంత్రి గడ్కరీ సూచన

న్యూఢిల్లీ: పాత వాహనాన్ని తుక్కుగా మార్చిన వాళ్లు కొత్తది కొంటే అదనపు రాయితీ ఇవ్వాలని కేంద్ర  రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆటోమొబైల్​ పరిశ్రమను కోరారు.  పాత వాహనాన్ని స్క్రాప్​ చేసి కొత్త వాహనం కొనేవారికి జీఎస్​టీ రాయితీ ఇవ్వాలని  ప్రధానినీ, ఆర్థిక మంత్రినీ కోరినట్లు కూడా చెప్పారు. 

వాహన స్క్రాపేజ్​ విధానం అటు పరిశ్రమకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు.  పాత వాహనాలను తుక్కుగా మార్చడం వల్ల రూ. 40వేల కోట్ల మేర జీఎస్​టీ ఆదాయం వస్తుందని తెలిపారు. స్క్రాప్​ ద్వారా స్టీల్, లెడ్​, అల్యూమినియం,  ప్లాటినం,  పల్లాడియం వంటి లోహాలను కూడా పొందవచ్చని గడ్కరీ వివరించారు.