హైదరాబాద్, వెలుగు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిఫరెన్స్, హైదరాబాద్ చాప్టర్ నిర్వహించనున్న డిజైన్ షోక్స్ ఇన్సైడర్ ఎక్స్ 2024ను ఈ నెల 28న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైన్ఎక్స్పర్టులు ఈ సందర్భంగా ప్రదర్శనలు ఇస్తారు. పరిశ్రమ నిపుణులను, సామాన్యులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని హైదరాబాద్ రీజినల్ చాప్టర్ తెలిపింది.
కార్యక్రమం జూన్ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. సంస్థ కోశాధికారి రాకేష్ వాసు మాట్లాడుతూ డిజైన్ పరిశ్రమలో సరికొత్త పోకడలు, ఆలోచనలు, ఆవిష్కరణల గురించి తెలియజేస్తామని అన్నారు.