కాయా కష్టం చేసుకునే గుండెలురా మావి.. అనేటోళ్లు పెద్దోళ్లు. నిజమే మరి ఉక్కు కండలతో జంతువులని సైతం వేటాడే సామర్థ్యం వారికి ఉండేది. వారి తిండి, పని, నిద్ర అలాంటిది. యూత్ఎక్కువగా ఉన్న ఇండియాలో వారి గుండెలెందుకో బలహీనపడుతున్నాయి.
హార్ట్ల కెపాసిటీ నానాటికి తీసికట్టుగా మారుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అడుగులు ముందుకు వేసినా.. ఆరోగ్యంపై అశ్రద్ధే ప్రాణాలమీదకు తీసుకువస్తోందా అంటే నిజమేనంటున్నారు వైద్యులు. తాజాగా మరో విద్యార్థి కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ విషాద ఘటన వివరాలు.. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంబీ)లో పీజీపీ చదువుతున్న విద్యార్థి ఆయుష్(27)కి జులై 26న గుండె పోటు వచ్చింది. గమనించిన ఫ్రెండ్స్ హాస్పిటల్కి తరలించారు.
అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు కన్ఫామ్ చేశారు. ఆయుష్బిట్స్పిలానీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అతని మృతి పట్ల ఐఐఎంబీ సంఘం సానుభూతి తెలియజేసింది.