పారిశ్రామిక విప్లవాలు ఏఐ, ఆటోమేషన్తోనే సాధ్యం : ఐఐటీ ప్రొఫెసర్ నరహరి శాస్ర్తి

పారిశ్రామిక విప్లవాలు ఏఐ, ఆటోమేషన్తోనే సాధ్యం : ఐఐటీ ప్రొఫెసర్ నరహరి శాస్ర్తి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: డిజిటల్ యుగంలో ముందుకు సాగాలన్నా, పారిశ్రామిక విప్లవాలు రావాలన్నా ఏఐ, ఆటోమేషన్ తోనే  సాధ్యమని ఐఐటీ హైదరాబాద్​ ప్రొఫెసర్​ నరహరి శాస్ర్తి అభిప్రాయపడ్డారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్సిటీలో రెండు వారాల పాటు నిర్వహించే నైబర్​ భద్రతలో డీప్​ ఫేక్​ బెదిరింపుల- గుర్తింపు, నివారణ, నైతిక సవాళ్లు అనే వర్క్​షాప్​ను ఆయన మంగళవారం ప్రారంభించారు.  

ఏఐసీటీఈ, ఏటీఏఎల్​ అడ్వాన్స్డ్​ పథకం గీతం స్కూల్​ ఆఫ్ టెక్నాలజీ  సీఎస్​ఈ విభాగం ఈ ఎఫ్​డీపీని నిర్వహిస్తోంది. వర్క్​షాప్ ప్రారంభోత్సవ అనంతరం నరహరి శాస్ర్తి మాట్లాడుతూ ఏఐ, ఎల్​ఎల్​ఎం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను మనం స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి దీటుగా ఇండియన్​ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని, ఆవిష్కరణలో దేనికి తీసిపోమన్నారు..