ప్రియాంక రెడ్డి హత్య కేసుపై స్పందించిన కేటీఆర్

ప్రియాంక రెడ్డి హత్య కేసుపై స్పందించిన కేటీఆర్

షాద్ నగర్లో  దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రియాంక రెడ్డి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన  ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ఈ దారుణానికి పాల్పడిన మృగాళ్లను తెలంగాణ డీజీపీ, పోలీసులు త్వరగా పట్టుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. బాధిత కుటుంబానికి  న్యాయం జరుగుతుందన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100 కి డయల్ చేయాలని సూచించారు.