
గండిపేట, వెలుగు: నార్సింగ్ మున్సిపాలిటీ కోకాపేటలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి శనివారం కూల్చివేయించారు. సర్వే నెంబర్ 147లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తెల్లవారుజామున నేలమట్టం చేయించారు. నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోసారి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.