
చందానగర్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. చందానగర్ సర్కిల్ హుడా కాలనీ సర్వే నంబర్ 366లో 261.32 గజాల స్థలంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సదరు నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారులపై నిర్మాణదారుడు తీవ్ర పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఆయన వద్ద పలువురు అధికారులు లంచం పుచ్చుకుని వదిలేస్తున్నారని విమర్శించారు.