అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా రెండు వాహనాలను సీజ్ చేసి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లాలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నూరు శివారులోని పారుపల్లి చింత దగ్గర అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్సమ్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 66 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాంగా రెండు వాహనాలను సీజ్ చేసి.. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ :- ఆ వార్తల్లో వాస్తవం లేదు : డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత