నకిలీ మద్యం కేసు కీలక సూత్రధారి అరెస్ట్

నకిలీ మద్యం కేసు కీలక సూత్రధారి అరెస్ట్

రంగారెడ్డి : నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా... మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఒడిశా నుంచి రాష్ట్రానికి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. దాడులు నిర్వహించి దాదాపు రూ.3 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఒడిశా కటక్ లోని ఓ మద్యం తయారీ స్థావరం నుంచి ఎక్సైజ్ శాఖ కోటి రూపాయల విలువైన 20వేల లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో తెలంగాణ బ్రాండ్ పేరుతో ఈ ముఠా నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో తేలింది.