నాకు కరోనా సోకింది: యూసుఫ్ పఠాన్

నాకు కరోనా సోకింది: యూసుఫ్ పఠాన్

భారత క్రికెట్ జట్టు ప్రముఖ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ కరోనా బారిన పడ్డాడు. శనివారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. శారీరకంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. చిన్నపాటి సింప్టమ్స్ కనిపిస్తున్నాయని యూసుఫ్ పఠాన్ ట్విట్టర్ లో ప్రకటించాడు. టెస్టు ఫలితాలు తెలిసిన వెంటనే తాను హోం క్వారంటైన్ లో ఉంటున్నానని.. వైద్యుల సూచన మేరకు అవసరాన్ని బట్టి మందులు, పౌష్టిక ఆహారం తీసుకుంటున్నానని పఠాన్ స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా తనను కలసిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. నెగటివ్ వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకుండా హోం క్వారెంటైన్ లో ఉండి.. కరోనా విస్తరించకుండా చూడాలని కోరాడు. ఇవాళ ఉదయం సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న ప్రకటన కలకలం రేపిన నేపధ్యంలో సాయంత్రానికే యూసుఫ్ పఠాన్ కూడా కరోనా బారిన పడడం క్రికెట్ రంగంలో హాట్ టాపిక్ అయింది. భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జోరుగా సాగుతున్న తరుణంలో క్రికెటర్లు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది.