
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఇవాళ ( జూన్ 30 ) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపటినుండి ( జులై 1 ) రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.వచ్చే మూడు నాలుగు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని.. జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
వచ్చే వారంలో ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సూచించింది వాతావరణ శాఖ.