Cyclone Biparjoy : ఈ ప్రాంతాల్లో వరదలు వస్తాయ్.. కరెంట్ ఉండదు..

Cyclone Biparjoy : ఈ ప్రాంతాల్లో వరదలు వస్తాయ్.. కరెంట్ ఉండదు..

గుజరాత్ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది బిపర్ జాయ్ తుఫాన్.. తీరం వైపు దూపుకొస్తూ.. గంట గంటకు వణుకు పుట్టిస్తుంది. 135 కిలోమీటర్ల వేగంతో.. జూన్ 15వ తేదీ అంటే గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు ద్వారక దగ్గర తీర దాటనున్నట్లు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. తీరం దాటిన తర్వాత 48 గంటలు అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈదురుగాలుల బీభత్సం ఉంటుందని.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది వాతావరణ శాఖ. 

వరదలు వస్తాయి, కరెంట్ ఉండదు :

గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటనున్న బిపర్ జాయ్ తుఫాన్ ప్రభావంతో.. దేవభూమి ద్వారక, రాజ్ కోట్, జాంనగర్, జునాఘడ్, పోరుబందర్, సోమనాథ్, మోర్బీ, వాల్సడ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని.. వరదలు వస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. కొన్ని గ్రామాల్లో నాలుగు, ఐదు అడుగుల మేర నీళ్లు ప్రవహించే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

అతి భారీ వర్షాలు, వరదలు, చెట్లు కూలిపోవటం వల్ల కరెంట్ సరఫరా నిలిచిపోతుందని.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ముందస్తుగానే బ్యాటరీలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించించారు అధికారులు. రెండు, మూడు రోజులు విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని.. కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణకు వారం రోజులు కూడా పట్టొచ్చని.. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నారు అధికారులు. 

భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే చేరవేసింది గుజరాత్ ప్రభుత్వం. కూలిన చెట్లను తొలగించటానికి భారీ వాహనాలతోపాటు కట్టర్లను సిద్ధం చేసింది. వరదల్లో చిక్కుకుంటే వారిని రక్షించటానికి పడవలను కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. మంచినీళ్లు, ఆహారం వంటి నిత్యాసవర వస్తువులను భారీ ఎత్తున నిల్వ చేసింది గుజరాత్ సర్కార్.

నాలుగు రోజుల ముందే తుఫాన్ హెచ్చరికలు రావటంతో.. ఈసారి భారీ ఎత్తున ముందస్తు చర్యలు చేపట్టి.. 40 వేల మంది ప్రజలను తీర ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక తుఫాన్ తీరం దాటటం ఒక్కటే మిగిలి ఉంది.