
మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల మార్చి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ బాలస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందన్నారు.
పోలీసుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. అలాగే ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.