గణేష్ మండపంలో హుజురాబాద్ అభ్యర్థుల ఫోటోలు

గణేష్ మండపంలో హుజురాబాద్ అభ్యర్థుల ఫోటోలు

నాగర్ కర్నూలు జిల్లాలో వెరైటీ గణేషులు, మండపాలు ఆకట్టుకుంటున్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో కరోనా జాగ్రత్తలు చెబుతున్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. మాస్కు,శానిటైజర్ తో వినాయకుడు కరోనా జాగ్రత్తలు చెబుతున్నట్లు అవేర్ నెస్ కల్పించారు. అచ్చంపేటలోని ఇంద్రానగర్ లో వెరైటీ మండపాన్ని ఏర్పాటు చేశారు. మండపంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఫోటోలు పెట్టారు. రాష్ట్ర రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నట్లు..  వినాయకుడి చుట్టూ అభ్యర్థుల  ఫోటోలు తిరిగేలా ఏర్పాటు చేశారు.