ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌

ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌

ఆంధ్రప్రదేశ్ లో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తొమ్మిది మందిని బదిలీ చేయగా.. 8 మంది కొత్త వారికి పోస్టింగ్‌ ఇచ్చింది.

* స్పోర్ట్స్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌గా ధ్యానచంద్ర 

* గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌గా టి.ఎస్‌.చేతన్‌

* గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అదనపు డైరెక్టర్‌గా గీతాంజలి శర్మ

* వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డైరెక్టర్‌గా జె.శివశ్రీనివాసు

* తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా శుభం బన్సల్‌

* సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్‌

* అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తిక్‌

* ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ సీఈవోగా సేతు మాధవన్‌

* మధ్యాహ్న భోజన పథకం ప్రత్యేక అధికారిగా ఎస్‌.ఎస్‌.శోభిక

* పాడేరు సబ్‌ కలెక్టర్‌గా పెద్దిటి ధాత్రిరెడ్డి

* పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా అపూర్వ భరత్‌

* కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాస్తవ

* కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా జి.విద్యార్థి

* తెనాలి సబ్‌ కలెక్టర్‌గా ప్రఖార్‌ జైన్‌

* మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా రాహుల్‌ మీనా

* ఆదోని సబ్‌ కలెక్టర్‌గా శివనారాయణ్‌ శర్మ

* రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా ఎస్‌.ప్రశాంత్‌ కుమార్‌