12 ఏళ్ల ఎదురుచూపులకు బ్రేక్: శ్రీలంకతో రెండో టెస్టులో సారంశ్ జైన్‌ అరంగేట్రం!

12 ఏళ్ల ఎదురుచూపులకు బ్రేక్: శ్రీలంకతో రెండో టెస్టులో సారంశ్ జైన్‌ అరంగేట్రం!

Saransh Jain Debut: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC 2027) ఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తన రెండో టెస్టులోనే 10/131 మైండ్ బ్లాకింగ్ ఫిగర్స్‌తో రచ్చ చేయగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు మాత్రం ఈ మ్యాచ్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కుల్‌దీప్, ఓవర్‌కు 4.64 రన్ రేట్‌తో ధారాళంగా పరుగెచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. స్పిన్ ట్రాక్‌పై కుల్‌దీప్ ఈ స్థాయిలో తడబడటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఆకాశ్ చోప్రా సంచలన విశ్లేషణ: 

కుల్‌దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ టీమ్‌లో మిగతా స్పిన్నర్లతో పోలిస్తే కుల్‌దీప్ చాలా తక్కువ ఓవర్లు వేశాడు, పైగా భారీగా పరుగులు ఇచ్చాడు. రెగ్యులర్ ఛాన్సెస్ రావట్లేదనే సానుభూతి ఉన్నప్పటికీ, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది. ఈ ప్రదర్శన కుల్‌దీప్‌కు ఖచ్చితంగా ఒక వేకప్ కాల్.. ఇలాగే జరుగుతుంటే మేనేజ్‌మెంట్ ఎక్కువ కాలం సర్దుకుపోలేదంటూ కుల్‌దీప్ భవిష్యత్తు డైలామాలో పడిందన్నాడు. 

కుల్‌దీప్ ప్లేస్‌లో సారాంశ జైన్‌కు డెబ్యూ ఆఫర్?: 

రెండో టెస్టులో కుల్‌దీప్ స్థానంలో యంగ్ ఆఫ్‌స్పిన్నర్ సారాంశ జైన్‌ను బరిలోకి దించవచ్చని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టులో జడేజా, మానవ్ సుతార్ రూపంలో ఇద్దరు క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. వీళ్లిద్దరూ వికెట్లు తీస్తూనే బ్యాటింగ్‌లోనూ మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. ఇక లంక టీమ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నందున, వెరైటీ కోసం ఒక ప్రాపర్ ఆఫ్ స్పిన్నర్‌ని టీమ్‌లోకి తెస్తే బాగుంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | ట్రేడ్ రూమర్స్‌కి ముంబై ఇండియన్స్ చెక్: హార్దిక్ పాండ్యాపై క్రేజీ పోస్ట్.. ఐపీఎల్ 2027లో రీటెన్షన్ కన్ఫర్మ్!

రెండో టెస్టులో భారత్ ప్లేయింగ్ XI ఎలా ఉండబోతోంది? : 

శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్‌కు మరో అవకాశం ఇస్తారా లేక కొత్త వ్యూహాలతో సారాంశ జైన్‌ను మైదానంలోకి దించుతారా అనేది సస్పెన్స్‌గా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ప్రతి మ్యాచ్ కీలకమైనందున, శుభ్‌మన్ గిల్ సేన ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగుతుందో లేదో చూడాలి మరీ.