హైదరాబాద్ లో బోనాలపై తలసాని సమీక్ష 

హైదరాబాద్ లో బోనాలపై తలసాని సమీక్ష 

హైదరాబాద్ : హైదరాబాద్ లో బోనాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని దేవాలయాల కమిటీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు అందిస్తుందన్నారు. ఓల్డ్ సిటీలో జరిగే బోనాలు, అంబారీ ఊరేగింపుపైనా చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.