
కరీంనగర్లో 50 వేల మందికి టెస్టులు చేయగా ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు లేవన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు అందరూ సేఫ్ అన్నారు. తాను ఇవాళ (21న) కరీంనగర్ వెళ్లాల్సి ఉండగా.. రెండు మూడ్రోజులు రావొద్దని వైద్య అధికారులు కోరారన్నారు. తాను వెళ్లి అధికారులను ,సిబ్బందిని, ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టొద్దనే కరీంనగర్ వెళ్లలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సార్లు బంద్ చేశామన్నారు. 24గంటల జనతా కర్ఫ్యూలో ఏ సమస్య రానివ్వమన్నారు. తెలంగాణ పేద రాష్ట్రం కాదన్నారు. పది వేల కోట్లయినా ఖర్చు చేస్తామన్నారు. పేదవారందరికీ రేషన్ ,15 రోజులకు సరిపడా సరుకులు పంపుతామన్నారు. ప్రత్రి ఇంటికి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావివ్వమన్నారు. కేసీఆర్ బతికుండగా ఆ పరిస్థితి రానివ్వమన్నారు కేసీఆర్.
see more news
తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ..రేపు అన్నీ బంద్
బ్రేకింగ్.. తెలంగాణలో21 కి చేరిన కరోనా కేసులు
ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు..జనతా కర్ఫ్యూను పాటిద్దాం
కాజీపేట రైల్వేస్టేషన్ లో కరోనా కలకలం.