
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్లో నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్ నికర లాభం ఆరు రెట్లు పెరిగి రూ.369 కోట్లకు చేరుకుంది. హైదరాబాద్కు చెందిన ఈ ఫార్మా సంస్థ గత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ కాలంలో రూ.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 1,061 కోట్లకు పెరిగిందని, అంతకు ముందు ఏడాది కాలంలో రూ. 453 కోట్లు వచ్చాయని నాట్కో ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఫార్ములేషన్ ఎగుమతుల పెరుగుదల, దేశీయ వ్యవసాయ, రసాయన వ్యాపారంలో పెరిగిన అమ్మకాల కారణంగా కంపెనీ ఈ క్వార్టర్లో బలమైన పనితీరు ఉందని తెలిపింది.