మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు ఉపశమనం లభించింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 52 సైబర్ క్రైం కేసులు నమోదవగా, రూ.25.58 లక్షలు- రికవరీ చేసినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా బాధితులకు న్యాయం జరిగిందని చెప్పారు. 167 వివిధ కేసులు, 364 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,513ఈ పెట్టీ కేసులతో కలిపి 2,044 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు.
