అప్పటికి..ఇప్పటికీ తేడా గమనించాలి

అప్పటికి..ఇప్పటికీ తేడా గమనించాలి

ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాల అమలులో గతానికి , ఇప్పటికే తేడా గమనించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడతగా 3 వేల 758 కోట్ల పెట్టుబడి సాయం అందించారు జగన్. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు ముఖ్యమంత్రి జగన్. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, కొన్ని మీడియా ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. తాము రైతన్నలకు ప్రతీ అడుగులోనూ తోడుగా ఉంటున్నామని చెప్పారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని వివరించారు.