
న్యూఢిల్లీ: ఐపీఎల్ మినీ ఆక్షన్లో స్టార్లకు తోడుగా కొంత మంది కుర్రాళ్లు కూడా భారీ ధరతో అదరగొట్టారు. అందులో సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన లెఫ్టాండ్ బ్యాటర్ వివ్రాంత్ శర్మ ఒకడు. జమ్మూ కశ్మీర్కు చెందిన 23 ఏళ్ల వివ్రాంత్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకుంది. బేస్ప్రైస్ రూ. 20 లక్షల కంటే 13 రెట్లు ఎక్కువ పెట్టి కొన్నది. కెరీర్లో ఎక్కువ మ్యాచ్లు ఆడకపోయినా, ఇటీవల ముగిసిన విజయ్ హజారే టోర్నీలో తన విధ్వంసకర బ్యాటింగ్తో వివ్రాంత్ ఆకట్టుకున్నాడు.
56.42 యావరేజ్తో 395 రన్స్తో జమ్మూ కశ్మీర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఉత్తరాఖండ్పై 154 (124 బాల్స్) రన్స్ చేసి తన టీమ్ను తొలిసారి నాకౌట్లోకి తీసుకెళ్లాడు. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్పై కూడా 62 బాల్స్లో 69 రన్స్ సాధించాడు. ఇప్పటివరకు 14 లిస్ట్–ఎ మ్యాచ్లు ఆడిన వివ్రాంత్ 519 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉండగా, 8 వికెట్లు కూడా తీశాడు. 9 టీ20ల్లో 191 రన్స్, 6 వికెట్లు పడగొట్టాడు. వారం కిందటే మధ్యప్రదేశ్పై రంజీల్లోకి అరంగేట్రం చేసిన వివ్రాంత్.. గుజరాత్తో రెండో మ్యాచ్ ఆడుతున్నాడు.