వెటర్నరీ జర్నల్‌‌‌‌ ఆవిష్కరణ

వెటర్నరీ జర్నల్‌‌‌‌ ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ రిటైర్డ్​వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో​ద్విభాషా త్రైమాసిక జర్నల్​ను ఆదివారం ఆవిష్కరించారు. విజయనగర్ కాలనీలోని వెట్స్ హోమ్‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్ట్ ఐఏఎస్ డాక్టర్ ఎం.వి. రెడ్డి హాజరై మాట్లాడారు. పాడి రైతుల కోసం ఫీల్డ్ వెటర్నరీ వైద్యులు మ్యాగజైన్ ప్రచురించడం అభినందనీయమన్నారు.  ఈ సందర్భంగా ఐదుగురు సీనియర్ పశువైద్యులకు పురస్కారాలు అందజేశారు.