- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నాగర్ కర్నూల్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండా తొలగిస్తుండగా రాడ్డు కరెంట్వైర్లపై పడడంతో షాక్ కొట్టి పంచాయతీ మహిళ కార్మికురాలు చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకం ఎగురవేశారు.
సాయంత్రం గ్రామ పంచాయతీ సిబ్బంది రేణుక, చిట్టెమ్మ, బిజినేపల్లి చిట్టెమ్మ జెండా తొలగిస్తుండగా ఇనుప రాడ్ ఒరిగి 11 కేవీ వైర్ల మీద పడింది. దీంతో షాక్ కొట్టడంతో రేణుక(42) అక్కడికక్కడే చనిపోయింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.