తిరుమలలో అగ్ని ప్రమాదం..ఆస్థాన మండపంలో మంటలు

తిరుమలలో అగ్ని ప్రమాదం..ఆస్థాన మండపంలో మంటలు

తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ఘటన చోటు చేసుకుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఉన్న మ్యాట్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

ఆస్థాన మండపంలో అగ్నిప్రమాదం జరగడంపై తిరుమల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.