కడుపునొప్పి భరించలేక మహిళ సూసైడ్

కడుపునొప్పి భరించలేక మహిళ సూసైడ్

ఘట్​కేసర్, వెలుగు: కడుపు నొప్పి భరించలేక మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని రాజీవ్​ గృహకల్పలో ఉండే సోమని జయమ్మ(55) కొన్నేండ్లగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని హాస్పిటల్స్​ తిరిగినా నయం కాలేదు. శుక్రవారం సాయంత్రం ఆమె కొడుకు రమేశ్​ షాప్​కు వెళ్లాడు.

అదే టైమ్​లో జయమ్మకు కడుపు నొప్పి రావడంతో భరించలేక ఫినాయిల్ తాగింది. ఇంటికి వచ్చిన కొడుకు.. తల్లిని వెంటనే గాంధీ హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. అక్కడ ట్రీట్​మెంట్​తీసుకుంటూ జయమ్మ శనివారం చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.

భార్య కాపురానికి రావట్లేదని మరొకరు..

జీడిమెట్ల: భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్ చేసుకున్న ఘటన సూరారం పీఎస్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంలోని అమీద్​బస్తీకి చెందిన తుకారాం (30)ఆటోడ్రైవర్. పదేండ్ల కిందట అతడికి పెళ్లైంది. వారి మధ్య గొడవలు రావడంతో తుకారాం భార్య లంగర్ హౌస్​లోని తల్లిండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఎన్నిరోజులైనా ఆమె తిరిగిరాకపోవడంతో మనస్తాపం చెందిన తుకారాం శుక్రవారం రాత్రి ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.