శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు

శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయ హుండీల ద్వారా రూ.3,75,21,688 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. శుక్రవారం అక్కమహాదేవి అలంకార మండపంలో సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు జరిగింది. 

28 రోజులకు ఈ ఆదాయం రాగా, 350 గ్రాముల బంగారం, 6 .28 కిలోల వెండి వచ్చినట్లు ఈవో తెలిపారు.