హైదరాబాద్ లోని పలువురు రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. మంత్రి చామకూర మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 6 గంటలుగా ఇన్ కంట్యాక్స్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుళ్ళ నివాసాలతో పాటు .. మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు.
తెల్లవారుఝాము నుంచే 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి. కాలేజీలు రియల్ ఎస్టేట్ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్ గా ఉన్నారు మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు.
కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి కి చెందిన కండ్లకోయా లోని CMR ఇంజనీరింగ్ కాలజీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు తెలిసింది.
మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్నకొడుకు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి సంస్థలు, ఆదాయాలు, లెక్కలు, పన్ను చెల్లింపులపై ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు.
బాలా నగర్ రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్ లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన లావాదేవీలు గుర్తించినట్టు సమాచారం.