Hyderabad : వాటర్ బోర్డ్ రెవెన్యూ పెంచుతాం: ఎండీ అశోక్ రెడ్డి

Hyderabad : వాటర్ బోర్డ్   రెవెన్యూ పెంచుతాం: ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: మెట్రోవాటర్​బోర్డు రెవెన్యూను పెంచడానికి నూతన సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్టు బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్ లోని బోర్డు థీమ్ పార్క్ లో రెవెన్యూ, ఐటీ విభాగ అధికారుల‌‌‌‌‌‌‌‌తో మేథోమ‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌న స‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌స్సు నిర్వహించారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించాలన్నారు.

 జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని నాన్ -రెసిడెన్షియల్ భవనాల జాబితా సేకరించి వాటిని వాటర్ సప్లై కనెక్షన్లతో పోల్చాలని సూచించారు. అనంతరం బోర్డు ఆదాయాన్ని పెంచడానికి కొత్తగా ఏం చేయాలన్న దానిపై ఈడీ మయాంక్​ మిట్టల్​కలిసి కొత్త సంస్కరణలను ప్రకటించారు. అవసరమైన ప్రాంతాల్లో కనీస బిల్లింగ్‌‌‌‌‌‌‌‌లో మార్పులు, మీటర్ రీడింగ్ ఏజెన్సీల నియామకం కోసం టెండర్ పిలవడం, దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బకాయిల వసూలు చేయాలని  నిర్ణయించారు.